చెత్త తిరిగి డంపు లో పడింది.. లాలూ యాదవ్ కూతురు నితీష్ కుమార్ పై ట్వీట్..!

-

బీహార్ రాజకీయాలులో ఈరోజు కీలకం అవబోతోంది ఇంకోసారి సీఎం నితీష్ కుమార్ పార్టీ మారబోతున్నారు. ఈరోజు నితీష్ కుమార్ మహాకూటమిని విడిచిపెట్టి ఎన్డీఏలో చేరుతున్నట్లు తెలుస్తోంది బిజెపి జేడీయు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది ఈ రాజకీయ గందరగోళంమధ్య వీధిలో నుండి సభ వరకు కూడా పోరాడుతామని ఆర్జెడి స్పష్టం చేయడం జరిగింది. ఆర్జెడి అధినేత లాలు యాదవ్ కూతురు రోహిణి ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య కుమార్ పైన మండిపడ్డారు చెత్త ఇప్పుడు మళ్ళీ డబ్బాలోకి వచ్చిందని అన్నారు. చెత్త డస్ట్ బిన్ లోకి తిరిగి వెళుతుంది ఆ గుంపు అంతా దుర్వాసనతో నిండిపోతుంది అని ట్విట్టర్ లో చెప్పారు. మా ఊపిరి ఉన్నంతవరకు మతతత్వ శక్తులపై ఏమో పోరాటం కొనసాగుతుందని నితీష్ కుమార్ రాజీనామా చేయడానికి ముందు రోహిణి పోస్ట్ చేశారు నితీష్ కుమార్ ఈరోజు 5 గంటలకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version