ఎనిమిదేళ్ళ బాలిక మీద అఘాయిత్యం.. చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు !

-

మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి రక్షణ దొరకడం లేదు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముదుసలి దాకా కామానికి బలైపోతున్నారు. తాజాగా తిరుపతిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారి మీద ఒక కామాంధుడు కన్నేసి అత్యాచార యత్నం చేశాడు. తిరుపతిలో ఎనిమిదేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఆటోడ్రైవర్ మునీర్  అత్యాచార యత్నం చేశాడు.

man

ఆమె భయంతో అరవడంతో ఈ విషయాన్ని గమనించిన అక్కడి స్థానికులు నిందితుడిని పట్టుకుని చితక బాదారు. అంతే కాక అతని చెట్టుకు కట్టేసి కొట్టారు. అక్కడ మహిళలు, స్థానికులు అందరూ కలిసి అతనిని రక్తం వచ్చేలా కొట్టడంతో చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే చిన్నారి మీద అలా చేయడంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో మహిళలు, స్థానికులు అతనిని కొట్టే దృశ్యాలు భయానకం కలిగిస్తున్నాయి. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version