ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. చిట్టీ వేసి ఒకరితో పెళ్లి..!

-

ప్రస్తుతం పెళ్లి చేసుకునేందుకు ఒక్క అమ్మాయి దొరక్కే ఎందరో పెళ్లి కాని ప్రసాదుల్లా మారిపోతున్నారు. అయితే కర్ణాటక లో ఓ యువకుడు సోషల్ మీడియాలో ఇద్దరిని ముగ్గులోకి దింపి ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఇద్దరినీ సోషల్ మీడియా లో పరిచయం చేసుకుంది ప్రేమించాడు. ఆ. యువతులు కూడా అతడిని గాఢంగా ప్రేమించారు.

అయితే ఇద్దరు యువతులు కూడా తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరిలో ఓ యువతి విషం తాగింది. చివరికి ఈ విషయం పై గ్రామంలో పంచాయితీ జరిగింది. దాంతో పెద్దలు చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వారిని పెళ్లి చేసుకోవాలని తీర్పు ఇచ్చారు. చీటీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరు వచ్చింది. దాంతో మరో యువతి యువకుడి చెంపలు వాయించి నన్ను మోసం చేశావ్..నిన్ను వదలను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తరవాత పెద్దల సమక్షం లో యువకుడి పెళ్లి జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version