బ్రేకింగ్ : మంచు విష్ణుకి షాక్.. మోసగాళ్ళు యూనిట్ ను అడ్డుకున్న ఉక్కు కార్మికులు !

-

టాలీవుడ్ కి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సెగ తగిలింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మోసగాళ్ళు యూనిట్ ను ఉక్కు ఉద్యమకారులు అడ్డుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మోసగాళ్ళు సినిమా ప్రమోషన్స్ చేసే ఉద్దేశంతో ఈరోజు సినిమా యూనిట్ విశాఖపట్నానికి వెళ్ళింది.

అక్కడ ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా సినిమా పెద్దలు ఎవరూ స్పందించక పోవడం మీద వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ లు, సినిమా ఫంక్షన్ ల కోసం ఏపీకి ఎవరు వచ్చినా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతానికి చిరంజీవి, నారా రోహిత్, ఆర్పీ పట్నాయక్ లాంటి వాళ్ళు గళం ఎత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version