ఉద్యోగం రాలేదని.. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య..!

-

ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగ వేటలో ఉన్న విద్యార్థులని ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు వివరాలని అందించారు. ఆ వివరాల ప్రకారం చూస్తే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఆలూపాక గ్రామానికి చెందిన సుంకర వెంకట సుబ్బారావు కూతురు సుంకర సాహితి ఎంబీఏ పూర్తి చేశారు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉండాలని అనుకున్నారు.

అందుకోసం రెండు నెలల క్రితం హైదరాబాద్ వచ్చారు దిల్షుక్ లక్ష్మీ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటున్నారు. ఉద్యోగం వెతుక్కునే క్రమంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఈ ఆత్మహత్య చేసుకున్నారు ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు తండ్రి వెంకట సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version