కార్మికులకు ఒక్క తెలంగాణలోనే న్యాయం జరుగుతుంది : మంత్రి ఎర్రబెల్లి

-

బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కార్మికులను పట్టించుకోవడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతి. కార్మికులకు ఒక్క తెలంగాణలోనే న్యాయం జరుగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధన్య మిస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి.

 

 

అందుకే రాష్ట్రంలోకి వలసలు పెరుగుతున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు స్థానికంగా పరిష్కారం అయ్యే వాటిని స్థానికంగానే పరిష్కరించుదామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఓ కార్మిక భవనం ఏర్పాటు చేసుకుందామన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో చర్చించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కార్మిక సంఘం నేతలు ఇంజాల మల్లేశం, రాములు, చంద్రన్న, సారంగపాణి, కార్మికులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version