హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 210 డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రారంభం

-

ఖైరతాబాద్‌ నియోజక వర్గం పరిధిలోని.. ఇందిరా నగర్‌ లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్థానిక టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్‌ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.17.85 కోట్ల వ్యయంతో.. నిర్మించిన 210 ఇండ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పరిశీలించారు.

లబ్దిదారుల గృహ ప్రవేశంలో పాల్గొని.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజలు ముఖం లో చిరునవ్వు చూడాలని ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ళు కేసీఆర్ ఇస్తున్నారని.. భారత దేశం లో ఎక్కడ లేని విధంగా ఒక్క హైద్రాబాద్ లోనే 9714 కోట్లు రూపాయలు తో ఇళ్ళు కడుతున్నామని చెప్పారు. గతం ప్రభుత్వం లో కట్టిన ఇళ్ళు డబ్బా మాదిరిగా ఉండేవని… ఆసియా ఖండం లోనే అతి పెద్ద హౌసింగ్ కాలనీ 112 బ్లాక్ లతో కొల్లూరు లో ఉందని గుర్తు చేశారు. సీఎం త్వరలోనే దానిని ప్రారంబిస్తారని చెప్పారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version