బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ : కేటీఆర్

-

బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న హైదరాబాద్ లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. అమిత్ షా పర్యటన ఖరారైన దగ్గరనుంచి టీఆర్ఎస్ నేతలు అమిత్ షా పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాజకీయ టూరిజం కొనసాగుతోందని, హైదరాబాద్‌కు మరో టూరిస్టు వచ్చి వెళ్లారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపై తెలంగాణ సెటైర్లు విసిరారు మంత్రి కేటీఆర్.

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో గత రాత్రి బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన అమిత్ షా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ అమిత్ షా.. . కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కదిలి రావాలని యువతకు పిలుపునిచ్చారు. అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. తెలంగాణలో పొలిటికల్ టూరిజం కొనసాగుతోందని, మరో టూరిస్ట్ వచ్చి తిని వెళ్లారని అమిత్ షాను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గత ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని కేటీఆర్ కొత్త అర్థం చెప్పారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version