ఏపీలో మరో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం

-

ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. పోలీసులన్నా.. కోర్టులన్న భయం లేకుండా పోతోంది.. ఏపీలో వరుసగా అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో.. ఇటు పోలీసులకు.. అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయినప్పటికీ.. పోలీసు శాఖ అఘాయిత్యాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక దిశా టీంలను కూడా ఏర్పాటు చేసింది.
గుంటూరు జిల్లాలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నల్లపాడు పీఎస్ పరిధిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురైంది.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జనసేన నాయకులు జీజీహెచ్కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని.. వరుస ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version