దారుణం.. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య

-

దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లిన ఓ బాలిక సాయంత్రం పూట కాసేపు పంటపొలాలు చూద్దామని వెళ్లింది. అంతే సరదాగా వెళ్లిన ఆ బాలిక అర్ధరాత్రైనా తిరిగి రాలేదు. ఆమె కోసం వెతికిన కుటుంబ సభ్యులకు చెరకు తోటలో ఆమె అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.

బాలిక ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. తన బంధువుల ఇంట్లో ఉంటూ స్కూల్​కి వెళ్తోంది. దీపావళి సందర్భంగా కర్ణాటకలోని కలబురగి జిల్లా అలంద్​ తాలుకాలోని తన సొంతూరుకు వచ్చిన ఆమె, అలా కాసేపు పంట పొలాలను చూడడానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ, అర్ధరాత్రైనా తిరిగి రాలేదు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు ఆమె మృతదేహం చెరకు తోటలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహంపై గాయాలు గుర్తించారు. అత్యాచారం జరిగిందేమోనన్న అనుమానంతో వైద్యులతో పరీక్షలు చేయించారు. వారి అనుమానమే నిజమైందని.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version