వచ్చే ఎన్నికల్లో మా ధనబలం చూపిస్తాం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

-

వచ్చే ఎన్నికల్లో మా ధనబలం చూపిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నిల్లో రూ.100 కోట్లు ఖర్చు పెడదామంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలకు తాము సిద్దం అవుతున్నామని, రూ.100 కోట్ల ఖర్చు పెట్టి అయినా సరే టీఆర్ఎస్, బీజేపీని ఓడించి అధికారంలోకి వద్దామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌తో దాడోపేడో తేల్చుకుందామని, బీజేపీని అణగదొక్కుకుంటూ ముందుకు సాగుతామంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చి తీరుతుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాకపోవడంపై జగ్గారెడ్డి స్పందించారు. మునుగోడులో గెలవకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాన్ని చూపిద్దామంటూ శ్రేణులకు సూచించారు.

 

కేసీఆర్‌కు భయపడి పోలీసులు డ్యూటీ చేయవద్దని, కాంగ్రెస్ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టవద్దని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని జగ్గారెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబం పోలీసులు లేకుండా బయట తిరగలేకపోతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యక్తలను పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version