ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రరూపం దాలుస్తున్న సంగతి విదితమే. ఇదే నేపథ్యంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈరోజు ఇప్పటికే ఒక ఏపీ మంత్రికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా ఈరోజు మరో ఎమ్మెల్యేకి కరోనా సోకినట్టు తెలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చింది. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇక ఈ విషయం నిర్ధారించిన తర్వాత ఆయనకు తిరుపతి స్విమ్స్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక ఈయన కూడా బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈయన కూడా జిల్లా మంత్రే కాబట్టి పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న వేల్లంపల్లికి కరోనా సోకడంతో ఈ విషయం మీద సందిగ్దత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version