రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను – వైసీపీ ఎమ్మెల్యే వసంత

-

రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే వసంత. యదార్ధ వాది లోక విరోధి.. నేను వాస్తవాలు మాట్లాడుతోన్న.. వాటిని సంచలనాలు అంటున్నారని.. రాజకీయాల్లోకి వచ్చాక చేయాల్సినవి చేయలేకపోయాననే అసంతృప్తి ఉందని తెలిపారు.

పార్టీలో కొందరు సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తారు.. నాకు అది ఇష్టం లేదని వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ తరహా రాజకీయాలు చేయలేం.. ప్రాంతీయ పార్టీల కాలం నడుస్తోందన్నారు వసంత. పొరంబోకులు పక్కన లేకుంటే రాజకీయాలు చేయలేం.. ఇది వాస్తవం.. అదే చెప్పానని.. ఉయ్యూరు శ్రీనివాస్ విషయంలో కూడా నా అభిప్రాయం చెప్పానని పేర్కొన్నారు. ఉయ్యూరు శ్రీనివాసుతో నాకు పరిచయం ఉంది.. ఎన్ఆర్ఐలు వల్ల లాభమే తప్ప.. నష్టం లేదని నా అభిప్రాయమన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు వసంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version