ఆటా మహాసభలకు ఎమ్మెల్సీ కవిత..

-

ప్రతి సారి నిర్వహించిన విధంగానే ఆటా సభలు అమెరికాలో ఘనంగా నిర్వహిచేందుకు ఆటా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
అంతేకాకుండా ఆటా మహా సభలకు పలువరు ప్రముఖులను ఆహ్వానించారు. అందులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో… టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అమెరికా ప‌ర్య‌ట‌న‌కు పయనమయ్యారు. అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ (ఆటా) 17 మ‌హాస‌భ‌ల్లో పాలుపంచుకునే నిమిత్తం అమెరికా వెళ్లిన క‌విత‌… శ‌నివారం రాత్రి వాషింగ్ట‌న్ చేరుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ఆమెకు ఆటా ప్ర‌తినిధులతో పాటు ఇప్ప‌టికే అక్క‌డ‌కు చేరుకున్న టీఆర్ఎస్ నేత‌లు గువ్వ‌ల బాల‌రాజు, మ‌హేశ్ బిగాల‌లు ఎమ్మెల్సీ కవితకు స్వాగ‌తం ప‌లికారు. ఆటా మ‌హాస‌భ‌ల్లో భాగంగా ఆమె అక్క‌డ ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియ‌న్‌ను ప్రారంభించ‌నున్నారు. అంతేకాకుండా బ‌తుక‌మ్మ‌పై ప్ర‌చురించిన ప్ర‌త్యేక సంచిక‌ను కూడా క‌విత ఆవిష్క‌రించ‌నున్నారు. ఆటా మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రు కావాలంటూ క‌విత‌కు ఇదివ‌ర‌కే ఆ సంస్థ ప్ర‌తినిధులు ఆహ్వానం పంపారు. వారి ఆహ్వానం మేర‌కు అమెరికా వెళుతున్న‌ట్లు గ‌త నెలలోనే క‌విత వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version