దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు…!

-

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. దేశం మరియు ప్రపంచం… కరోనా వైరస్ వ్యాధితో పోరాడుతున్నందున, సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన పండుగలు జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Modi

“నవరాత్రి పవిత్ర పండుగకు అందరికి శుభాకాషలు… జగత్ జనని మన జగదంబ మీ అందరికీ ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుని తెస్తుంది. జై మాతా! ” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్నా సరే చాలా రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు చాలా హుషారుగా మొదలయ్యాయి. బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలను చాలా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ వద్ద భారీ ఏర్పాట్లు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version