ఎంపీ కవితను కలిసిన బ్రిటీష్ హై కమిషన్ ఉన్నతాధికారులు

-

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను బ్రిటీష్ హై కమిషన్ ఉన్నతాధికారులు కైరన్ డ్రాకే, డిప్యూటీ హై కమిషనర్ ఆండ్ర్యూ ఫ్లెమింగ్ ఆమె నివాసంలో కలిశారు. రెండు రోజుల పాటు నిజామాబాద్ లో వారు పర్యటించనున్న నేపథ్యంలో ఎంపీ కవితను కలిసి వివిధ విషయాలను చర్చించారు. నిజామాబాద్ ఎంపీగా తాను చేస్తున్న అభివృద్ధి పనులను, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. పసుపు బోర్డు ఏర్పాటుకు , రైలు సౌకర్యం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జరుపుతున్న చర్చలను ఇతర విషయాలను వారికి తెలియజేశారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రాఘురామన్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version