వైసీపీలో తిరుబాటు మొదలైంది : ఎంపీ రఘురామ

-

వైసీపీలో తిరుగుబాటు మొదలైందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇన్నాళ్లు తమ పార్టీలో ఉంటూ అవమానాలు దిగమింగుకుంటూ ఉన్నవాళ్లంతా ఆత్మగౌరవంతో తిరగబడే రోజులు మొదలయ్యాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులతో తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పారు.

మరోవైపు పార్లమెంట్‌ చట్టం ద్వారానే ఏపీ రాజధాని మార్పు సాధ్యమని ఎట్టకేలకు మాజీ మంత్రి కొడాలి నాని గ్రహించారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే రానున్న ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని కేంద్రంతో పార్లమెంట్‌లో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామంటూ ఆయన పేర్కొన్నారని గుర్తుచేశారు. అదానీ ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారని, జగన్‌తో స్నేహం తర్వాత ఆయన కంపెనీ షేర్లు కుప్పకూలిపోయాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version