“సీతారామం” సీక్వెల్ పై సీత మనసులో మాట !

-

గత సంవత్సరం హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అద్భుత ప్రేమకావ్యం “సీతారామం”. ఇందులో దుల్కర్ సల్మాన్ మరియు మృణాళిని ఠాకూర్ హీరో హీరోయిన్ లుగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో వీరిద్దరో రామ్ మరియు సీతాలుగా ఎంతబాగా నటించారో చెప్పలేము. ఈ సినిమా హిట్ అయినప్పటి నుండి ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాలు సీక్వెల్ గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు డైరెక్టర్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా తాజాగా మృణాళిని ఠాకూర్ ఈ సినిమా సీక్వెల్ గురించి తన మనసులో మాటను బయటపెట్టింది.

ఈ సినిమాలో సీత పాత్రను నేను చాలా బాగా ఎంజాయ్ చేశానని , చాలా మంది ఫ్యాన్స్ నన్ను సీత అంటూ పిలుస్తున్నారన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందో లేదో తెలియదు కానీ.. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీతారామం సీక్వెల్ గురించి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version