టీడీపీకి ఓటు వేయాలని..నాకు ఆఫర్‌ వచ్చింది – నందికొట్కూరు ఎమ్మెల్యే

-

టీడీపీకి ఓటు వేయాలని..నాకు ఆఫర్‌ వచ్చిందని…నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నాకూ ఆఫర్ వచ్చిందని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని తెలిపారు. నా కుమారునికి ఫోన్ చేశారు…..మా నాన్న ఒప్పుకోడని నా కుమారుడు తోసిపుచ్చారని తెలిపారు.

పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లి లో మా ఇంటివద్ద పర్సనల్ గా మాట్లాడాలని గన్ మెన్ ను సంప్రదించారన్నారు. గన్ మెన్ ఫోన్ లో మాట్లాడిస్తే కర్నూలు త్రి టౌన్ సిఐ వద్ద పని ఉందని, పర్సనల్ గా మాట్లాడాలన్నారని తెలిపారు. ఈ టైం లో ఎందుకు ఉదయమే రమ్మన్నా… పోలింగ్ కు ముందు మరీ ఫోన్ చేశారు….ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడానని వివరించారు. పర్సనల్ గా మాట్లాడాలనంటే… మీ ఆటలన్నీ తెలుసు అని చెప్పానని స్పష్టం చేశారు. రూ. 200 కోట్లు జగన్ ఫోటో ఒకవైపు పెడితే జగన్ ఫోటో నే తీసుకుంటా అని చెప్పానన్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version