నెల్లూరు జిల్లా: లోకేష్ పాదయాత్రకు 2 రోజులు బ్రేక్…

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు అయిన నారా లోకేష్ 2024 లో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు ప్రజల మనసులను గెలవడానికి యువగళం అన్న పేరుతో పాదయాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తన పాదయాత్ర కొనసాగుతుందగా.. టీడీపీ కార్యకర్తలకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. లోకేష్ రేపు మరియు ఎల్లుండి పాదయాత్ర చేయడం లేదని పార్టీ తెలియచేసింది. నారా లోకేష్ ఈ పాదయాత్రలతో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మరియు వైసీపీ నేతలపైనా ఎటువంటి ఆధారాలు లేని కోట రూపాయల అవినీతిని చేశారంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలపై సదరు నేతలు నిరూపించాలని సవాలు చేస్తున్నా పట్టించుకోని వైనం. కాగా ఈ వ్యాఖ్యల పైన లోకేష్ పై కేసులు పెట్టడం మరియు లోకేష్ తన కుటుంబ సభ్యులపైన దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మేజిస్ట్రేట్ కు కంప్లైంట్ లు ఇవ్వడం జరిగిది.

ఈ పనిమీద రేపు మరియు ఎల్లుండి కోర్టులు వెళ్లాల్సి ఉండడంతో ఈ రెండు రోజులు నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version