బిజెపి నేత హత్యకేసులో 9 మంది లొంగుబాటు

-

తమిళనాడులో బిజెపి నేత దారుణ హత్య కలకలం రేపింది. చెన్నైలోని పూందీపలై హైవే నుంచి కాంచీపురం వెళ్లే చెక్ పోస్ట్ సమీపంలో గురువారం రాత్రి బిజెపి ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర కోశాధికారిగా ఉన్న శంకర్ చెన్నై నుంచి కారులో బెంగళూరు మీదుగా ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో పూనమలై సమీపంలో నజరత్ పేట జంక్షన్ వద్దకి కారు రాగానే ఓ ముఠా కారుపై నాటు బాంబులతో దాడి చేసింది.

ఈ దాడిలో ధ్వంసం అయిన కారు కొద్ది దూరం వెళ్లి ఆగింది. దీంతో కారు దిగి రోడ్డుపై పరిగెత్తుతూ వెళ్తున్న బిజెపి నేత శంకర్ ను ఆ ముఠా వెంబడించి నరికి చంపింది. తాజాగా ఈ కేసులో 9 మంది లొంగిపోయారు. ఇవాళ ఎగ్మోర్ మెజిస్ట్రేట్ కోర్టులో నిందితులు సరెండర్ అయ్యారని పోలీసులు తెలిపారు. మరోవైపు ఇది కాంగ్రెస్ రౌడీలా పనేనని బిజెపి ఆరోపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version