బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు జారీ చేశారు. HCU అంశంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేశారని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఈ విషయంపై మన్నె క్రిశాంక్ స్పందిస్తూ..
‘కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ ప్రారంభించింది.AIను ఎక్కడా వాడలేదు.ఇటీవల HCUలో విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు అన్ని వాస్తవమే.మేము లీగల్గా ఎదుర్కోటాం. జింకలు ఎందుకు రోడ్డు మీదకు వచ్చాయి, ఇళ్లలోకి కూడా వెళ్ళాయి అవన్నీ వీడియోలు ఉన్నాయి.
అక్కడ జింకలు లేవు, అక్కడ నక్కలు ఉన్నాయని అన్నారు.ఆంక్షలు పెట్టారు,ఇక్కడ ఎవరు రావొద్దు అని ప్రకటన చేశారు.Aiతో వీడియోలు సృష్టించారని ప్రభుత్వం అబద్ధం చెబుతోంది. Ai గురించి మాట్లాడే అర్హత ఉందా కాంగ్రెస్కు ఉందా?జాతీయ స్థాయిలో ఆ వీడియోలు జింకలు,నెమళ్లున్నాయని తేలింది.ఈ ప్రభుత్వం నాపై 4 కేసులు పెట్టింది.
జింకలు చనిపోవడానికి కారణం ఎవరు, ఆ చెట్లను నరకడానికి కారణం ఎవరు?వీటికి కారణం అయిన ఎవరిపైనా కేసులు పెట్టాలి.అందరూ వీడియోలు పెడుతున్నారు. రూ.20వేలు ఇస్తూ రీల్స్ చేయిస్తున్నారు’ అని మన్నే క్రిశాంక్ వెల్లడించారు.