NMACC launch: నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లాంచ్​లో బాలీవుడ్ స్టార్స్ సందడి

-

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్‘ఎన్‌ఎంఏసీసీ’ (నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌) ప్రారంభ వేడుకలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ కల్చరల్‌ సెంటర్‌ ఆరంభోత్సవాలు మూడురోజులపాటు జరగనున్నాయి. మొదటిరోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముకేశ్‌ అంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ ఈవెంట్​లో బాలీవుడ్‌, హాలీవుడ్‌, సౌత్‌ సినీ పరిశ్రమలకు చెందిన తారలు సందడి చేశారు. అగ్రనటుడు రజనీకాంత్‌ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, ఆయన సతీమణి గౌరీ ఖాన్‌, కుమారుడు ఆర్యన్‌ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, షాహిద్‌ కపూర్‌ ఆయన సతీమణి మీరా రాజ్‌పుత్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర-కియారా అడ్వాణీ దంపతులు, దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకా చోప్రా-నిక్‌ జొనస్‌, శ్రద్ధాకపూర్‌, జాన్వీకపూర్‌, సోనమ్‌ కపూర్‌, అలియాభట్‌ కుటుంబం.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ దీన్ని ప్రారంభించారు. ఈ నాలుగంతస్తుల భవంతిలో ఒక మ్యూజియం, 2000 మంది సామర్థ్యంతో కూడిన థియేటర్‌, ఆర్ట్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌కు ప్రత్యేక స్థలం, స్టూడియో థియేటర్‌ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version