మెట్రో పిల్లర్ వద్ద మరో ప్రమాదం.. బైకర్​కు గాయాలు

-

కర్ణాటకలో మొన్న జరిగిన మెట్రో ప్రమాదం మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నడిబొడ్డులో మెట్రో సమీపంలోని జాన్సన్​ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. రోడ్డు మధ్యలో 2 అడుగుల గుంత ఏర్పడింది. ఈ గుంతలో పడి ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఎప్పటి లాగే వాహనాలు వెళ్తుండగా ఈ గుంత ఏర్పడినట్లు వాహనదారులు చెబుతున్నారు. అండర్​ గ్రౌండ్​ మెట్రో పనులు జరుగుతున్న కారణంగానే మట్టి లూజ్​ అయి ఈ గుంత ఏర్పడినట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ గుంతలో పడి ఓ వ్యక్తి గాయపడటం వల్ల.. ట్రాఫిక్​ సిబ్బంది అప్రమత్తమయ్యారు. గుంత చట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ గుంత ఏర్పడ్డ రోడ్డు కొంత భాగం బ్లాక్ చేశారు. సమాచారం అందుకున్న బెంగళూరు వెస్ట్​ డివిజన్​ డీసీపీ కాలా కృష్ణమూర్తి ఘటనా స్థలానికి చేసుకున్నారు. రోడ్డులో గుంత ఏర్పడటంపై దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version