సునీల్‌ కనుగోలు అంశంలో విచారణకు హాజరుకావడం లేదు: మల్లు రవి

-

పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలు ఉండడంతో తాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరుకాలేనని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి వెల్లడించారు. గత నవంబర్ 24న ఇనార్బిట్ మాల్ సమీపంలోని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సునీల్ కనుగోలు కార్యాలయం నుంచి రాజకీయ నాయకులను అవమానపర్చేటట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో సైబర్ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవాళ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు స్పష్టం చేసిన ఆయన… సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడు పిలిచిన విచారణకు హాజరవుతానని వెల్లడించారు. చట్టప్రకారం సైబర్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు లోబడి ఉంటానని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదు చేశారని తెలుస్తోందని మల్లు రవి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version