రేపు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

-

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు ప్రశ్నోత్తరాల సమయం లేకుండా కేంద్రం ఉభయ సభల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం స్టాటాలజీ టీమ్ తో భేటీ కానున్నారు.

ఇక మరోవైపు ఉమ్మడి వ్యూహాన్ని అనుసరించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇండియా కూటమీ నేతలతో భేటీ కానున్నారు. ఇటీవలే ఇండియా కూటమిలో పలు పార్టీలు ఫ్లోర్ లీడర్లను నియమించాయి.వీరితో ఖర్గే సమావేశం కానున్నారు. రేపు రాత్రి 7 గంటలకు ఖర్గే నివాసంలో పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరుగనుంది. ఈనెల 18 నుంచి 5 రోజుల “పార్లమెంట్ ప్రత్యేక
సమావేశాలు” పై చర్చ చేయనున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్-వన్ ఎలక్షన్స్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తుందని వార్తలు వినిపించడంతో సోనియాగాంధీ, ఖర్గే సమావేశాలు ఏర్పాటు చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version