నేడు దిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

-

నేడు దిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో పాటు ఇతర సభ్యులు పాల్గొననున్నారు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే భావసారూప్యమున్న పార్టీలతో సీట్ల సర్దుబాటుపై చర్చ జరపనున్నట్లు తెలిసింది.

మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్‌ గాంధీ యాత్రపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర సహా హైబ్రిడ్‌ మోడ్‌లో ఈ యాత్రను నిర్వహించనున్నట్లు తెలిసింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ భేటీలో ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. మరోవైపు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను కాంగ్రెస్‌ పార్టీ సమీక్షించుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version