‘ఒక్క ఛాన్స్’ అంటూ.. గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ రిక్వెస్ట్

-

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ యాప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా గుజరాత్ ప్రజలకు ట్విటర్ వేదికగా ఓ స్వీట్ రిక్వెస్ట్ చేశారు.

‘నేను మీ సోదరుడిని. మీకు కుటుంబ సభ్యుడిలాంటివాడిని. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మీకు ఉచిత విద్యుత్ ఇస్తాను. మీకోసం పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తాను. మిమ్మల్ని అయోధ్య రామమందిరం వద్దకు తీసుకెళ్తాను. గుజరాత్ ప్రజలు భారీ మార్పునకు సిద్ధమయ్యారు. మేం తప్పకుండా విజయం సాధిస్తాం’అని షెడ్యూల్ అనంతరం కేజ్రీవాల్‌ ట్విటర్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మేం 90 నుంచి 95 సీట్లు దక్కించుకుంటాం. ఇదే జోరు కొనసాగితే.. 140 నుంచి 150 సీట్లలో విజయం సాధించగలం. గుజరాత్‌ ప్రజలు భాజపా పాలనతో అలసిపోయారు. ఆ పాలనలో అవినీతిని మోర్బీలోని తీగల వంతెన దుర్ఘటన మన కళ్లముందు ఉంచింది. ఈసారి అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’అని కేజ్రీవాల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version