‘ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు’.. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

-

ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆపబోమని తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఏదైనా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఓటర్లు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్​ ప్రజల ఆధార్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేస్తోందని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే, డోలా సేన్, సాకేత్ గోఖలే, లోక్‌సభ ఎంపీలు ప్రతిమా మోండల్, సజ్దా అహ్మద్‌లతో కూడిన టీఎంసీ ప్రతినిధి బృందం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​ను కలిసి తమ రాష్ట్రంలో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్​పై వస్తున్న ఆరోపణల గురించి చెప్పింది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం టీఎంసీ బృందానికి హామీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version