NVSS ప్రభాకర్‌ పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా!

-

బీజీపీ నాయకుడు NVSS ప్రభాకర్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. బీజీపీ నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు లీగల్‌ నోటీసు పంపారు కాంగ్రెస్‌ ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ. కాంగ్రెస్‌ నాయకుల నుంచి బెంజ్‌ కారు లబ్ది పొందినట్లు ఆరోపణలు చేశారు ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌. అయితే.. దీనిపై కాంగ్రెస్‌ ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ సీరియస్‌ గా స్పందించారు.

10 crore defamation suit against NVSS Prabhakar

ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై స్పందించారు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి….రెండు రోజులల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు దీపాదాస్‌ మున్షీ. ఒకవేళ ఆధారాలు చూపించనట్లయితే…..రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు దీపాదాస్‌ మున్షీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version