కోహ్లీని చూసి తన తండ్రి గర్వపడుతుంటారు : గంభీర్

-

వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో 50వ సెంచరీ చేసి….వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న రికార్డును కింగ్ కోహ్లీ బ్రేక్ చేశారు. దీనిపై గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘ఇంత గొప్ప విజయాన్ని సాధించిన విరాట్ కు అభినందనలు. తన దివంగత తండ్రి అతన్ని చూసి గర్వపడతారు. గొప్ప స్థాయికి చేరిన కుమారున్ని మేఘాలలో నుంచి చూస్తూ ఆనంద పడుతుంటారని అనుకుంటున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

gambhir slams virat kohli

ఇది ఇలా ఉండగా… భారత్-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ పాకిస్తాన్ నటి సెహార్ షిన్వారి సంచలన ఆరోపణలు చేసింది. ‘భారత టీమ్ ఆటగాళ్లు మంచి నటులు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని వారికి తెలుసు. కానీ నిజంగా మ్యాచ్ ఆడుతున్నట్లు నటించారు’ అని ట్వీట్ చేసింది. ‘ఇండియన్ టీం మరోసారి ఫైనల్ కు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. భారత్ అన్నింటిలో మన దేశం కంటే ఎందుకు ముందు ఉంది?’ అని అక్కసు వెళ్లగక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version