భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. గ్రాండ్ సెలబ్రేషన్స్!

-

భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ తరుణంలో.. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అక్టోబర్ 14న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది. మ్యాచ్ కు ముందు అదిరిపోయే వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.

ind vs pak

అమితాబచ్చన్, రజినీకాంత్, సచిన్ టెండూల్కర్ లు అతిధులుగా రానున్నారు. స్టేజిపై సింగర్ అర్జిత్ సింగ్ పెర్ఫార్మన్స్ ఉండనుంది. ఇది ఇలా ఉండగా, వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ 9వ మ్యాచ్ జరగనుంది. ఈ తొమ్మిదవ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జడ్జి స్టేడియంలో… ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా… ఇవాళ కూడా గెలవాలని ఆత్రుతగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version