చంద్రబాబు భార్యకు 521 కోట్లు ఎలా వచ్చాయ్‌ ?. లోక్‌సభలో రచ్చ !

-

 

లోక్‌సభలో నారా చంద్రబాబు నాయుడును కడిగిపారేశారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. చంద్రబాబు అవినీతి పరుడని తెలిసి కూడా సిగ్గు లేకుండా ఎన్డీయేలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. చంద్రబాబు అవినీతిని దేశమంతా చూసింది. అయినా అలాంటివాడితో సిగ్గు వదిలేసి మీరెలా పొత్తు పెట్టుకున్నారు ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

NDA govt won’t last beyond Maharashtra and UP polls,’ claims TMC’s Kalyan Banerjee

బీజేపీతో చేతులు కలపగానే చంద్రబాబు నిజాయితీపరుడు అయిపోయాడా? ఈడీ, సీబీఐ ఎందుకు అతడ్ని అరెస్ట్ చేయడం లేదు? అని ప్రశ్నించారు. ఎన్డీయేతో దోస్తీ ముసుగులో టీడీపీ గోల్‌మాల్ చేసిందని.. బీజేపీ 400 సీట్లు గెలవబోతోందంటూ ప్రచారం చేయించి.. ఒకే ఒక్క రోజులో రూ.521 కోట్లు స్టాక్ మార్కెట్‌లో సంపాదించాడని టీడీపీ అగ్రనేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఎన్డీయేతో పొత్తు ఉండటంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు లేదు.. అంతా గప్‌చుప్ అయ్యారని లోక్‌సభలో ఉతికారేశారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version