ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. వారంలో రెండో సారి !

-

ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వారంలో రెండో సారి ఢిల్లీకి వెళుతున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అయితే.. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకు చేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి , హైదరబాద్ జిల్లాలకు అవకాశం కల్పించేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలిసింది.

The congress leadership is angry at the Congress party getting fewer seats in many states including Telangana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిలతో చర్చించిన తర్వాత ఏఐసీసీ తుది నిర్ణయo తీసుకుంటుందని పీసీసీ వర్గాలు తెలిపాయి. నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేర్లపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే… ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version