నేడు ప్రధాని నరేంద్రమోదీ 104వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం

-

ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 కాగానే అందరికీ గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే మన్ కీ బాత్. ఈ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను వ్యక్తీకరించడమే కాకుండా.. ఆ నెలలో దేశంలో, ప్రపంచంలో చోటుచేసుకున్న కీలక సంఘటనల గురించి మాట్లాడుతుంటూరు.

టీవీ ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకోవడం గమనార్హం. 2014 అక్టోబర్‌ 3వ తేదీన విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ 104వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని 104వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ ప్రస్తుతం ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version