తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

-

తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పవిత్రమైన ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సుని నింపాలి. ఈ పంటకోత కాలం మీకు సమృద్ధిని, ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను’ అని తెలుగులో ట్వీట్ చేశారు.

Prime Minister Modi wishes Telugu people Sankranti

ఇది ఇలా ఉండగా…  ప్రధాని మోదీ…ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు ఖరారు అయింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారు. ఈ నెల 16న అంటే రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండనుంది.. ఈ సందర్భంగా రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్షపన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటుకు శ్రీకారం చుడతారు. 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version