నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నా.. డైలమాలో రాహుల్‌ గాంధీ

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డైలమాలో ఉన్నారట. ఓ అంశంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. ఆయన ఈసారి పోటీచేసిన వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ)లో ప్రజలు ఆయన్ను మంచి మెజార్టీతో గెలిపించిన విషయం తెలిసిందే.  ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ విషయంపై స్పందిస్తూ రాహుల్‌ గాంధీ తాను ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నానని అన్నారు. ఏ నిర్ణయం తీసుకొన్నా రెండు నియోజకవర్గాలు సంతోషంగా అంగీకరిస్తాయని తెలిపారు. ఆయన కేరళలోని మల్లప్పురంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘‘నేను ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్‌ లేదా రాయ్‌బరేలీలో ఒక దానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా ఆయన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version