గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన శశిథరూర్ పీఏ.. తనకేం సంబంధం లేదన్న ఎంపీ

-

బంగారం స్మగ్లింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మాజీ పీఏ శివకుమార్ ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. మే 29వ తేదీన దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. అందులో శివ కుమార్ ఒకరని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అయితే ఈ విషయంపై శశిథరూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషయం విని తాను షాక్కు గురయ్యానని అన్నారు. ఆ వ్యక్తి తన మాజీ సిబ్బందిలో ఒకరని.. ఎయిర్పోర్టుకు సంబంధించిన కార్యకలాపాల్లో తనకు పార్ట్టైమ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని తెలిపారు. రిటైర్ అయిన ఆ 72ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నాడని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని.. దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరిస్తానని శశి థరూర్ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version