మణిపుర్​ ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు

-

మణిపుర్‌లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర సర్కార్​ను, మణిపుర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. మణిపుర్‌లో మహిళలపై అమానవీయ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. బహిర్గతమైన వీడియోల వల్ల ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపింది.

ఈ ఘటన తనను ఆందోళనకు గురిచేసిందని ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సీజేఐ వ్యాఖ్యానించారు.

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు వీడియోను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version