నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు

-

నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. తమ అభ్యర్థి పై ప్రతిపక్షాల నుంచి మద్దతు కోరే ప్రణాళిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతిగా ఉత్తర భారతానికి చెందిన ఓబిసి లేదా అప్పర్ క్యాస్ట్ నేతను ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

సమావేశం తరువాత ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరును అధికారికంగా ఎన్డీఏ తరఫున ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టనున్న బిల్లులు, వాటిపై జరిగే చర్చలో పాల్గొనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version