ఢిల్లీ: కాంగ్రెస్లో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, పునియా..

-

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌‌.. సంచలనాలకు తెర తీశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోన్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల బరిలో దిగబోతోన్నారు. సహచర రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. తాజాగా వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిశారు వినేష్ ఫొగట్, భజరంగ్ పునియా.

మరోవైపు రెజ్లర్ వినేష్ ఫొగట్ రైల్వేలో తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీని కలిసారు. కాంగ్రెస్ లో చేరి హర్యానా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇక ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్‌ ఫైనల్స్‌ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version