సమంత-నయనతార మధ్య ఎమోషనల్‌ బాండ్‌..పిక్ వైరల్

-

విజయ్‌ సేతుపతి, నయనతార, సమంతలను ఒక చోటకు తీసుకొచ్చి విఘ్నేష్‌ శివన్‌ ఓ ప్రయోగం చేశాడు. . ఈ ముగ్గురు ఇప్పుడు సౌత్‌ టాప్‌ స్టార్లు. నటన పరంగా విజయ్‌ సేతుపతికి నేషనల్ వైడ్‌ గా ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు సమంత, నయనతారకు ఓ రేంజ్‌ క్రేజ్‌ ఉంది. వీరు ముగ్గురు తీస్తున్న తాజాగా సినిమానే. కాథువాక్కు రెండు కాదల్‌.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై హైప్‌ పెంచింది. ఇక తాజాగా… .. నయనతార తో దిగిన ఓ ఫోటోను తాజాగా సమంత షేర్‌ చేస్తూ… చేసిన కామెంట్లు వైరల్‌ గా మారాయి. 22.2.2022 తేదీన 20.02 గంటలకు అంటూ హీరోయిన్‌ సమంత ఓ ఫోటోను షేర్‌ చేసింది.

నయనతారకు నాకు ఉన్న స్పెషల్‌ ఫ్రెండ్‌ షిప్‌ ఇదే నంటూ సమంత పేర్కొంది. నయనతార సోషల్‌ మీడియాలో లేదు. ఆమె తరఫున ప్రేమను నేను పంపిస్తున్నా అని అభిమానులకు చెప్పుకొచ్చింది సమంత. అయితే.. వీరిద్దరూ దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version