తగ్గేదెలే.. పవన్‌ యాత్రకు దిగిన బ్లాక్ కలర్ స్కార్పియోలు..

-

ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉనప్పటికీ.. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఏపార్టీ ఆపార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు కావాల్సిన అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతో జనసేనాని పవన్ కల్యాణ్ అక్టోబరులో బస్సు యాత్ర చేపడుతుండడం తెలిసిందే. అక్టోబరు 5న తిరుపతిలో పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో, పవన్ కోసం భారీ కాన్వాయ్ ని సిద్ధం చేస్తున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో వాహనాలు జనసేన కార్యాలయంలోకి బారులు తీరి వెళుతున్నట్టు ఓ వీడియోలో కనిపించింది. 2023లో ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే పవన్ కల్యాణ్ దసరా నుంచి ఐదు నెలల పాటు రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. పవన్‌ కాన్వాయ్‌ కోసం సిద్దం చేసిన కార్ల ఫోటో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version