మొయినాబాద్ యువతి మృతి.. కొత్త ట్విస్ట్‌..!

-

ఈ కేసులో కొత్త ట్విస్ట్. చనిపోయినది మల్లెపల్లికి చెందిన తైసిన్‌గా అధికారులు గుర్తించారు. తైసినే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మల్లెపల్లి నుంచి మొయినాబాద్ కి వచ్చిన తైసిన్ ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. ఇది వరకు కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది తైసిన్. అయితే వ్యక్తిగత కారణాలు అలానే కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య చేసుకుంది.

ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో విచారణ చేసారు. యువతి డిప్రెషన్ లో ఉంది అని తెలుస్తోంది. అందుకే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు చెప్పారు. ఆటో లో ఒంటరిగా వెళ్లిందట. ఆటో డ్రైవర్ కూడా ఆ విషయం చెప్పాడు. అలానే అటుగా తరవాత ఏ వాహనం వెళ్ళలేడుట. సెల్ఫోన్ నెంబర్ ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా ఆమె వివరాలు ని సేకరించారు. ఘటనా స్థలం లోనే సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version