పొంగులేటి & జూపల్లి కృష్ణారావులు BRS ద్రోహులు… : మంత్రి నిరంజన్ రెడ్డి

-

తాజాగా BRS అధిష్టానం తీసుకున్న నిర్ణయం వలన పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావులను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన కారణంగానే సస్పెన్షన్ వేటు వేశారని ఆ పార్టీ నాయకులు క్లారిటీ ఇస్తున్నారు. కాగా ఈ విషయంపై తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి సస్పెండ్ అయిన నాయకులపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ సీనియర్ నాయకులను కూడా కాదని, పొంగులేటి మరియు జూపల్లి కృష్ణారావు లకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చినా… వీరికి అర్ధం కాలేదన్నారు.

కేసీఆర్ ను మరియు పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేశారంటూ వారిపై మండిపడ్డారు. తమకు ఇష్టం వచ్చినట్లు డ్రామాలు ఆడారని.. ఒక పార్టీలో ఉండి మరో పార్టీ నాయకుడు ఫోటోను పెట్టించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరూ కూడా BRS ద్రోహులు అని మంత్రి నిరంజన్ రెడ్డి రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version