ఫ్యాక్ట్ చెక్: కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పదవ తరగతి వారికి బోర్డు ఎగ్జామ్స్ ఉండవా..? నిజమెంత..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు తెగ వస్తున్నాయి. అయితే ఇటువంటి నకిలీ వార్తలు నమ్మితే మోసపోవాల్సి వస్తుంది. తాజాగా ఒక వార్త వచ్చింది. అయితే ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ స్కీములు కి సంబంధించి ఎక్కువ వార్తలు వస్తున్నాయి.

అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వాట్సాప్ లో తాజాగా ఒక మెసేజ్ వచ్చింది. మరి ఇంక ఆ మెసేజ్ ఏమిటి..?, ఆ మెసేజ్ లో నిజమెంత అనేది తెలుసుకుందాం. తాజాగా వాట్సాప్ లో ఒక మెసేజ్ తెగ సర్క్యులర్ అవుతోంది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పదో తరగతి వాళ్లకి బోర్డు ఎగ్జామ్స్ ఉండవని ఆ మెసేజ్ లో ఉంది.

అయితే మరి ఆ వాట్సాప్ మెసేజ్ నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. వాట్సాప్ లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. అలానే పదవ తరగతి వాళ్లకి బోర్డు ఎగ్జామ్స్ లేవు అనడంలో కూడా ఎటువంటి నిజం లేదు. ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇటువంటి ఆర్డర్స్ ని ఏమి కూడా ఇవ్వలేదు.

కనుక ఇలాంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండటం మంచిది. లేదంటే అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఇటువంటి వార్తలుని ఎవరికి ఫార్వర్డ్ చెయ్యొద్దు. వాళ్ళు కూడా అనవసరంగా ఇబ్బంది పడతారు. వీలైనంత వరకు ఇలాంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండండి లేకపోతే అనవసరంగా సమస్యలను ఎదుర్కోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version