వాహనాలు 12 వేలకు మించితే తిరుమలలో నో ఎంట్రీ : టీటీడీ

-

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. కరోనా వల్ల రెండు సంవత్సరాలు నిరాడంబరంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను ఈ ఏడాది రెట్టింపు వైభవంతో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో బిజీ అయింది. ఈ బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ఆలోచనతో టీటీడీ నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.

తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలు 12వేలు దాటిన తరువాత అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్‌ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లాలని సూచించింది. ఏటా గరుడ వాహన సేవ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు.

ఈ ఏడాది గరుడ సేవ 1వ తేదీ కాగా.. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2 వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version