ఏ పార్టీలోకి వెళ్లినా తప్పించుకోలేరు.. బాలినేనికి ఎమ్మెల్యే దామర్ల స్ట్రాంగ్ వార్నింగ్..!

-

ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈనెల 26న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్న విషయం తెలిసిందే. ఒంగోలు నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి తొలి రెండేళ్ల పాటు జగన్ మంత్రి వర్గంలో పని చేశారు. అంతకు ముందు వైఎస్ కేబినెట్ లో కూడా మంత్రిగా పని చేశారు బాలినేని. ఇటీవలే వైసీపీ కి రాజీనామా చేసిన విషయం విధితమే.

బాలినేని వ్యవహారం పై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ స్పందించారు. వైసీపీ హయాంలో బాలినేని టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో నాపై 32 అక్రమ కేసులు పెట్టించారని.. చంద్రబాబును కూడా బాలినేని దూషించారని గుర్తు చేశారు. అధికారం పోయి వంద రోజులు కాలేదు. అప్పుడే బాలినేని వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ప్రకాశం జిల్లాను బాలినేని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version