కరీంనగర్ లో వీధికుక్కల దాడి.. ట్విట్టర్ లో మంత్రి ఆదేశాలు..!

-

తెలంగాణలో రోజు రోజుకు వీధికుక్కల బెడద పెరుగుతోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మహిళలపై దాడులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు కూడా ఉన్నారు.  తాజాగా కరీంనగర్ లో ఓ మహిళా పై వీధి కుక్కలు దాడి చేశాయి. 

వివరాల్లోకి వెళ్లితే.. కరీంనగర్ లోని 53వ డివిజన్ లో ఓ చిన్నారిపై దాడి చేసేందుకు వీధికుక్కలు ప్రయత్నించాయి. అయితే అదే సమయంలో చిన్నారితో పాటు మహిళా కూడా ఉంది. వారిద్దరి పై వీధి కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే వీధికుక్కలను తరిమేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని జిల్లా కలెక్టర్, మంత్రి పొన్నం ప్రభాకర్ కు షేర్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version