ఇండియాలో వన్ డే వరల్డ్ కప్.. పాకిస్తాన్ తన మ్యాచ్ లు ఎక్కడ ఆడుతుందో తెలుసా ?

-

2023 అక్టోబర్ లో ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా పాకిస్తాన్ ల మధ్యన సంబంధాలు సరిగా లేనందున… పాకిస్తాన్ ఇండియాకు వస్తుందా మ్యాచ్ లు ఆడుతుందా అన్న విషయం సస్పెన్స్ లో పడింది. కానీ ఇందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పలు ప్రత్యామ్నాయాలను చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చివరికి ఒక నిర్ణయం మాత్రం ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆదే మ్యాచ్ లను తటస్థ వేదిక బంగ్లాదేశ్ లో నిర్వహించడానికి ఐసీసీ ప్లాన్ చేస్తోంది. దాదాపుగా దీనికి ఇరు దేశాలను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతాయి. కాగా గతంలో 2011 లో వన్ డే వరల్డ్ కప్ ఇండియాలో జరుగగా… ఇండియా టైటిల్ ను సాధించింది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అలాంటి సువర్ణావకాశం వచ్చింది. మరి ఇంకోసారి వరల్డ్ కప్ సాధించి అభిమానుల ఆశ తీరుస్తరా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version